Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో కరోనా విజృంభణ

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (20:13 IST)
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కట్టడి నేపథ్యంలో ఇప్పటికే అక్కడ పలు జిల్లాల్లో లాక్‌డౌన్‌, రాత్రిపూట కర్ఫ్యూ అమలవుతోంది. ఈ క్రమంలో వార్ధా జిల్లా యంత్రాంగం కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ జిల్లాల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడం వల్ల జిల్లా యంత్రాంగం 60 గంటల పాటు లాక్‌డౌన్‌ విధించింది.

శనివారం ఉదయం 8 గంటల నుంచి 60 గంటలపాటు లాక్‌డౌన్‌ అమల్లో ఉండనుందని ఆ జిల్లా కలెక్టర్‌ ప్రేర్నా పేట్రియాట్‌ తెలిపారు. ఈ సమయంలో నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా.. దుకాణాలు, మెడికల్‌షాపులు తెరిచే ఉంటాయని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.2 వేల జరిమానా విధించనున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం ఆ జిల్లాలో గురువారం ఒక్కరోజే.. 251 మంది వైరస్‌ బారినపడగా.. నలుగురు మరణించారు. ముఖ్యంగా హోలీ పండుగ దృష్ట్యా వైరస్‌ మరింత వ్యాప్తి చెందకుండా లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వరుసగా జిల్లాల్లో నాలుగోరోజు కూడా 500కు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మరణించారు. కాగా, ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకు పూర్తి లాక్‌డౌన్‌ విధించగా.. తర్వాత కొంత సడలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్యాపేట్‌ జంక్షన్‌ లో ఏంజరిగింది ?

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments