Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్‌కు మరో దెబ్బ... 15 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది జంప్

Webdunia
గురువారం, 11 జులై 2019 (09:19 IST)
కాంగ్రెస్ పార్టీకి దెబ్బపై దెబ్బ తగులుతోంది. గోవా రాష్ట్రంలో ఆ పార్టీకి చెందిన 15 మంది శాసనసభ్యుల్లో 10 మంది పార్టీకి గుడ్‌బై చెప్పారు. వీరంతా బీజేపీలో చేరారు. పైగా, తమను బీజేపీలో విలీనం చేసుకోవాల్సిందిగా వారు కోరగా, వెంటనే విలీన ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ విషయాన్ని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్  సావంత్ వెల్లడించారు. 
 
గోవా అసెంబ్లీలో మొత్తం 40 సీట్లు ఉండగా, ఇందులో బీజేపీకి 17 మంది, కాంగ్రెస్ పార్టీకి 15, గోవా ఫార్వార్డ్ పార్టీకి 3, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీకి 1, ఎన్సీపీకి 2, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది శాసనసభ్యుల్లో పది మంది బీజేపీలో చేరిపోయారు. దీంతో గోవాలో కాంగ్రెస్ పార్టీ బలం ఐదుకు పడిపోయింది. 
 
నిజానకి కర్నాటక సంక్షోభంతో కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ పరిస్థితుల్లో గోవాలో పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో ఆ పార్టీ నేతలకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. పైగా, తమను బీజేపీలో విలీనం చేయాలని కోరుతూ ప్రతిపక్ష నేత చంద్రకాంత్‌ కవ్లేకర్‌ నేతృత్వంలో ఎమ్మెల్యేలు స్పీకర్ రాజేశ్‌ పట్నేకర్‌ను కలిసి లేఖ ఇచ్చారు. మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు విలీనానికి సై అనడంతో కాంగ్రెస్  శాసనసభా పక్షం బీజేపీలో విలీనమైంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments