ఉత్తర కాశీలో ప్రకృతి విలయం... ముగ్గురు మృతి.. 9 మంది గల్లంతు

ఠాగూర్
ఆదివారం, 29 జూన్ 2025 (11:10 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రకృతి ప్రకోపించింది. క్లౌడ్ బరస్ట్ కారణంగా కుంభవృష్టి కురిసింది. ఉత్తర కాశీ జిల్లాల్లో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం కారణంగా అపారనష్టం వాటిల్లింది. ఈ ఘటనలో నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ వద్ద పనిచేస్తున్న తొమ్మిది మంది కార్మికులు గుల్లంతయ్యారు. మరో ముగ్గురు చనిపోయినట్టు స్థానికుల సమాచారం. 
 
ఉత్తర కాశీ జిల్లాలో ఉన్నట్టుండి వర్షం కురిసింది. దీంతో నిర్మాణంలో ఉన్న ఒక హోటల్ కుప్పకూలిపోయింది. నిర్మాణ సమయంలో అక్కడ ఉన్న కార్మికుల్లో తొమ్మిది మంది కనిపించకుండా పోయారు. వీరంతా హోటల్ శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 
కార్మికుల గల్లంతు ఘటనను ఉత్తర కాశీ జిల్లా మేజిస్ట్రేట్ ప్రశాంత్ ఆర్య ధృవీకరించారు. 8 నుంచి 9 మంది కార్మికులు గల్లంతైనది నిజమేని ఆయన తెలిపారు. క్లౌడ్ బరస్ట్ కారణంగా యాత్రికులు ఎక్కువగా ప్రయాణించే బార్కోట్ - యమునోత్రి మార్గం కూడా తీవ్రంగా దెబ్బతిందని దీంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. కాగా, నేడు, రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెండ్ అలెర్ట్ జారీచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments