Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లాక్కెళ్లి గదిలో బంధిస్తే.. పారిపోయేందుకు యత్నించగా హాకీ స్టిక్‌తో తలపై కొట్టారు..

Advertiesment
crime

ఠాగూర్

, శనివారం, 28 జూన్ 2025 (14:02 IST)
కోల్‌కతా న్యాయ విద్యార్థినిపై అత్యాచారం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితురాలు పెళ్లికి నిరాకరించడం వల్లే అధికార టీఎంసీ విద్యార్థి విభాగానికి చెందిన నాయకుడు కక్షగట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడుకి సెక్యూరిటీ సిబ్బంది కూడా సహకరించడం గమనార్హం. విద్యార్థిని బలవంతంగా లాక్కెళ్లి గదిలో బంధించారు. అక్కడ నుంచి ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నిస్తే తలపై హాకీ స్టిక్‌తో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. పైగా, ఈ దారుణాన్ని బయటకు చెబితే ఆమె తల్లిదండ్రులపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపుతామని బెదిరించినట్టు నిందితురాలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. 
 
అంతేకాకుకుండా న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగినట్టు వైద్యులు ధృవీకరించారు. నిందితులు అత్యంత పాశవికంగా ప్రవర్తించినట్టు రిపోర్టులో తేలింది. బాధితురాలి మెడ, ఛాతిభాగాలపై పదునైన పంటిగాట్లు కూడా ఉన్నాయి. గోళ్ళతో రక్కిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆమె వ్యక్తిగత అవయవాలను కూడా తీవ్రంగా గాయపరిచారు అని ఓ సీనియర్ పోలీస్ అధికారి మీడియాకు వివరించారు. ఈ నెల 25వ తేదీన కస్బా ప్రాంతంలోని సౌత్ కోల్‌కతా న్యాయ కాలేజీలో ఈ దారుణం ఘటన జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న బాధితురాలిని నిందితులు సెక్యూరిటీ సిబ్బంది గదిలోకి లాక్కెళ్లి బంధించారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి బారి నుంచి తప్పించుకోవడానికి బాధితురాలు ప్రయత్నించగా హాకీ స్టిక్‌తో ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దారుణాన్ని బయటకు చెబితే ఆమె తల్లిదండ్రులపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపుతామని నిందితుడు బెదిరించినట్టు బాధితురాలు తన వాంగ్మూలంలో పేర్కొంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మనోజిత్ మిశ్రా (31)తో పాటు మరో ముగ్గురు నిందితులు అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైలు పట్టాలపై కారు నడిపిన యువతి మెంటల్ ఆస్పత్రికి తరలింపు (Video)