Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా బలగాలు ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్లాయి? ఎవరైనా చెప్పగలరా? చిదంబరం

Webdunia
బుధవారం, 8 జులై 2020 (19:23 IST)
భారత భూభాగమైన గాల్వాన్ లోయ నుంచి చైనా బలగాలు వెనక్కి వెళ్లిపోయాయంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. వీటిపై కేంద్రం మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం స్పందించారు. చైనా బలగాలు ఎక్కడ నుంచి ఎక్కడకి వెళ్లాయి? ఎవరైనా చెప్పగలరా? కేంద్రం చెబితే వినాలని వుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. 
 
గాల్వన్ లోయలోని సమస్యాత్మక ప్రాంతం నుంచి చైనా బలగాలు వెనక్కి వెళ్లినట్టు మీడియాలో వార్తలపై చిదంబరం బుధవారం స్పందిస్తూ, చైనా బలగాలు వెనక్కి వెళ్లాయన్న దానిపై వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నానని పేర్కొన్నారు.
 
'చైనా బలగాలు వెనక్కి మరలడాన్ని స్వాగతిస్తున్నాను. అయితే, ఏ ప్రదేశం నుంచి చైనా వెనక్కి వెళ్లింది... ఇప్పుడు ఎక్కడికి వెళ్లింది? ఈ వివరాలను నాకు ఎవరైనా చెబుతారా?" అని అడిగారు. ఈ వివరాలను తాను కేంద్రం నోట వినాలనుకుంటున్నానని చిదంబరం వ్యాఖ్యానించారు.
 
"ఒకవేళ మన దళాలు కూడా వెనక్కి మరలాయనుకుంటే అది ఎక్కడ్నించి? చైనా వెనక్కి మరలిన ప్రాంతం నుంచే భారత బలగాలు కూడా వెనక్కి మరలాయా? లేక, భారత బలగాలు కానీ, చైనా బలగాలు కానీ ఎల్ఏసీకి అట్నుంచి ఇటో, ఇట్నుంచి అటో వెళ్లాయా? నాకు ఈ ప్రశ్నలన్నింటికి జవాబులు కావాలి. అసలు జూన్ 15న ఏం జరిగిందన్న దానిపై భారతీయులందరూ తహతహలాడిపోతున్నారు" అంటూ చిదంబరం ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments