Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా బలగాలు ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్లాయి? ఎవరైనా చెప్పగలరా? చిదంబరం

Webdunia
బుధవారం, 8 జులై 2020 (19:23 IST)
భారత భూభాగమైన గాల్వాన్ లోయ నుంచి చైనా బలగాలు వెనక్కి వెళ్లిపోయాయంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. వీటిపై కేంద్రం మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం స్పందించారు. చైనా బలగాలు ఎక్కడ నుంచి ఎక్కడకి వెళ్లాయి? ఎవరైనా చెప్పగలరా? కేంద్రం చెబితే వినాలని వుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. 
 
గాల్వన్ లోయలోని సమస్యాత్మక ప్రాంతం నుంచి చైనా బలగాలు వెనక్కి వెళ్లినట్టు మీడియాలో వార్తలపై చిదంబరం బుధవారం స్పందిస్తూ, చైనా బలగాలు వెనక్కి వెళ్లాయన్న దానిపై వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నానని పేర్కొన్నారు.
 
'చైనా బలగాలు వెనక్కి మరలడాన్ని స్వాగతిస్తున్నాను. అయితే, ఏ ప్రదేశం నుంచి చైనా వెనక్కి వెళ్లింది... ఇప్పుడు ఎక్కడికి వెళ్లింది? ఈ వివరాలను నాకు ఎవరైనా చెబుతారా?" అని అడిగారు. ఈ వివరాలను తాను కేంద్రం నోట వినాలనుకుంటున్నానని చిదంబరం వ్యాఖ్యానించారు.
 
"ఒకవేళ మన దళాలు కూడా వెనక్కి మరలాయనుకుంటే అది ఎక్కడ్నించి? చైనా వెనక్కి మరలిన ప్రాంతం నుంచే భారత బలగాలు కూడా వెనక్కి మరలాయా? లేక, భారత బలగాలు కానీ, చైనా బలగాలు కానీ ఎల్ఏసీకి అట్నుంచి ఇటో, ఇట్నుంచి అటో వెళ్లాయా? నాకు ఈ ప్రశ్నలన్నింటికి జవాబులు కావాలి. అసలు జూన్ 15న ఏం జరిగిందన్న దానిపై భారతీయులందరూ తహతహలాడిపోతున్నారు" అంటూ చిదంబరం ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments