Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛత్తీ‌స్‌గఢ్ హార్రర్ : మహిళను దగ్గరుండి గ్యాంగ్ రేప్ చేయించిన పోలీస్...

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (16:33 IST)
అత్యాచారాలపై ఎన్ని చట్టాలు చేసినప్పటికీ మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో తాజాగా మరో దారుణం జరిగింది. ఓ మహిళ సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ కామాంధుల ముఠాలో ఓ పోలీస్ కూడా ఉండటం గమనార్హం. ఈ కేసులో పోలీస్ దగ్గరుండి గ్యాంగ్ రేప్ చేయించాడు. ఈ దారుణానికి పాల్పడిన కామాంధుల్లో ఒక ఉపాధ్యాయుడు, ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాయ్‌పూర్‌కు చెందిన ఓ మహిళపై పోలీస్, ప్రభుత్వ అధికారి, ఒక ఉపాధ్యాయుడు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ మహిళపై అత్యాచారం చేయడమేకాకుండా ఆ సమయంలో వీడియో తీసి మహిళపై బెదిరింపులు చేశారు. 
 
ఈ విషయం బయటికి చెబితే వీడియో సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. అంతటితో ఆగకుండా బాధితురాలి కూతురిపై కూడా అత్యాచారం చేస్తామని బెదిరించారు. దీంతో దిక్కుతోచని స్థితిలో దు:ఖాన్ని గొంతులోనే బిగపట్టుకుని ఉంది బాధితురాలు. 
 
ఆ తర్వాత నుంచి ఆ కామాంధుల ఆగడాలు హెచ్చుమీరిపోయాయి. ప్రతి రోజూ ఆ మహిళను వేధించసాగారు. దీంతో వేధింపులు భరించలేని ఆ బాధితురాలు నాలుగు నెలల తర్వాత పోలీస్ స్టేషన్ గడపతొక్కి, తనకు జరిగిన అన్యాయాన్ని బోరున విలపిస్తూ చెప్పింది. బాధితురాలు ఇచ్చిన లిఖిత ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం