Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురి సజీవదహనం

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (14:29 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ కారు బోల్తాపడటం వల్ల చెలరేగిన మంటల్లో కాలి ఐదుగురు సజీవదహనమయ్యారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. 
 
వేగంగా వెళులుతున్న కారు ఒకటి ఓ కల్వర్టును ఢీకొనడంతో బోల్తాపడింది. ఆ వెంటనే కారు నుంచి మంటలు చెలరేగడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. మృతుల వివరాలు తెలియాల్సివుంది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు తీసుకున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments