Webdunia - Bharat's app for daily news and videos

Install App

మావోయిస్టుల ఘాతుకం.. 10 మంది పోలీసుల మృతి

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2023 (15:48 IST)
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో ఒకటైన ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోమారు పెట్రేగిపోయారు. ఈ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలో పోలీసుల వాహనాన్ని పేల్చేశారు. దీంతో పది మంది పోలీసులు మృత్యువాతపడ్డారు. పోలీసుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మందుపాతర పేలుడు జరిపడంతో ఈ దారుణం జరిగింది. పోలీస్ వాహనం డ్రైవర్‌తో పాటు పది మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.
 
దంతేవాడ అడవుల్లో మావోయిస్టులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో బుధవారం పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టారు. ఆ ఆపరేషన్‌ ముగించుకుని తిరిగి వస్తుండగా నక్సల్స్‌ ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. పోలీసుల వాహనం సమాచారాన్ని ఇన్ఫార్మర్ల ద్వారా తెలుసుకున్న మావోలు.. ఆ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మందుపాతరతో పేల్చేశారు. దీంతో ఈ దారుణం జరిగింది. మృతుల్లో ఒక పౌరుడు కూడా ఉన్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments