Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

సెల్వి
శుక్రవారం, 17 మే 2024 (11:16 IST)
టీవీ ఛానల్ యాంకర్‌పై పూజారి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. చెన్నైలోని ప్రధాన అమ్మవారి ఆలయానికి చెందిన పూజారి తీర్థంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పూజరి పేరు కార్తీక్ మునిస్వామి. తనపై జరిగిన దారుణంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
అత్యాచారానికి గురైన యాంకర్ చెన్నైలోని సాలిగ్రామం ప్రాంతంలో ఉంటుంది. తరచూ ఆలయానికి వెళ్లే తనకు ఆలయ పూజారి కార్తీక్ మునిస్వామితో పరిచయం ఏర్పడిందని తెలిపింది. ఈ స్నేహంతో తాను గుడికి వచ్చినప్పుడల్లా గర్భగుడిలోకి తీసుకెళ్లి ప్రత్యేక దర్శనం చేయించేవాడని చెప్పింది. 
 
ఈ క్రమంలో తమకు స్నేహం పెరిగిందని... ఒకరోజు తాను గుడికి వచ్చినప్పుడు తన బెంజ్ కారులో డ్రాప్ చేస్తానని చెప్పాడని... కారులో ప్రయాణిస్తుండగా తీర్థం ఇచ్చాడని, దీన్ని తాగిన తర్వాత తనకు స్పృహ తప్పిందని ఆమె తెలిపింది. ఆ తర్వాత తనపై అత్యాచారం చేశాడని చెప్పింది. ఇది జరిగిన తర్వాత తనను గుడిలోనే పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని వెల్లడించింది. 
 
కానీ ఆ తర్వాత చాలా సార్లు తమ ఇంటికి వచ్చాడని, తాను గర్భవతిని అయ్యానని తెలిపింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అబార్షన్ చేయించాడని, ఆ తర్వాత తనను వ్యభిచారం చేయమని బలవంతం చేశాడని పేర్కొంది. ఆమె ఫిర్యాదుతో పూజారిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హ్యాట్సాఫ్ కింగ్ నాగార్జున.. నెట్టేసిన ఫ్యాన్‌ను కలిశాడు.. (వీడియో)

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments