Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో మరో భారీ విమానాశ్రయం.. ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2022 (11:01 IST)
తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఇప్పటికే ఓ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. కానీ నానాటికీ పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య.. కార్గో సేవలకు కూడా డిమాండ్ పెరుగుతుండటంతో తమిళనాడు ప్రభుత్వం చెన్నై నగరంలో మరో భారీ విమానాశ్రయం నిర్మాణం చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని సీఎం స్టాలిన్ ప్రకటించారు.
 
డీఎంకే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనుందని.. ప్రస్తుతం డీపీఆర్ రూపొందించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయని సీఎం స్టాలిన్ వెల్లడించారు. ప్రభుత్వ సంస్థ టిడ్కో చెన్నై సమీపంలోని పరందూర్‌లో నూతన విమానాశ్రయం కోసం స్థలాన్ని అన్వేషిస్తోందని తెలిపారు. 
 
రూ.20,000 కోట్ల ఖర్చు అంచనాతో ఈ ఎయిర్ పోర్టును నిర్మించనున్నామని..దీంతో 10 కోట్ల మంది ప్రయాణించేందుకు వీలుగా ఈ విమానాశ్రయాన్ని తీర్చిదిద్దుతామని సీఎం స్టాలిన్ వివరించారు.
 
ఈ విమానాశ్రయంలో 2 రన్ వేలు, ప్రయాణికుల టెర్మినల్ భవనాలు, కార్గో టెర్మినల్, ట్యాక్సీ వేలు, యాప్రాన్ ఉంటాయని వివరించారు. విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతుండడం, సరకు రవాణా రంగంలో ఏర్పడిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త ఎయిర్ పోర్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments