రియల్టర్ కాల్పుల కేసు.. నిందితుల అరెస్ట్

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2022 (10:29 IST)
రియల్టర్ కాల్పుల కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. మాదాపూర్‌లో కలకలం రేపిన ఈ ఘటనలో నిందితులను అరెస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. ముజాయిద్‌, మహ్మద్‌ జిలానీ, మహ్మద్‌ ఫిరోజ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు…రెండు కంట్రీమేడ్‌ పిస్టళ్లు, ఏడు రౌండ్ల బుల్లెట్లు, ఒక కత్తితో పాటు కారు, బైక్‌ను సీజ్‌ చేశారు.
 
పాతబస్తీ కాలాపత్తర్‌లోని నవాబ్‌కుంటకు చెందిన రౌడీషీటర్‌ ఇస్మాయిల్‌, అతని స్నేహితుడు జహంగీర్‌పై కాల్పులు జరిపింది ముజాయిద్‌, జిలానీ, ఫిరోజ్‌ గ్యాంగ్‌. నీరూస్‌ జంక్షన్‌ ..హండ్రెడ్‌ ఫీట్ రోడ్డులో సోమవారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల కేసును మాదాపూర్‌ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. 
 
నిందితుల కోసం 5 పోలీస్‌ టీమ్‌లు విస్తృతంగా గాలించాయి. జహీరాబాద్‌లో ముగ్గురినీ అరెస్ట్‌ చేశారు. ఇస్మాయిల్‌ హత్యకు జహీరాబాద్‌లోని భూ వివాదమే కారణమని దర్యాప్తులో తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jana Nayagan Leaks: జన నాయగన్ లీక్స్.. రజనీకాంత్, చిరంజీవి సీరియస్

Ranveer Singh: అనంత్ అంబానీ పుట్టినరోజు వేడుకలో రణవీర్ సింగ్ కు అభిమానం వెల్లువెత్తింది

కన్నడ చిత్రం రాక్షసపురం కు కె.ఎస్. రామారావు సపోర్ట్

Raghu Kunche: రఘుకుంచె గేదెలరాజు రిలీజ్ డేట్ మారింది

Niharika: ప్రతీ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉండేలా చూసుకుంటా : నిహారిక కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎస్‌బీఐ లైఫ్ యొక్క థాంక్స్ ఏ డాట్ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమం

కలబంద రసం ఆరోగ్య రహస్యాలు

హైబీపీ వుందా? ఐతే ఈ ఫ్రూట్స్ తిని చూడండి

మహిళల పాదరక్షలపై క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రవేశపెట్టిన పారాగాన్

పాలుతో పాటు తినకూడని పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments