Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధాన్యం కొనుగోలు చేసిన 4 రోజుల్లో నగదు: వెంకయ్య

Webdunia
మంగళవారం, 3 మార్చి 2020 (07:11 IST)
అన్నదాతల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేసిన వెంటనే నాలుగు రోజుల్లో నగదు చెల్లించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అధికారులకు సూచించారు.

కేంద్రం ఇచ్చిన మద్దతు ధర రైతులకు సరిగా అందడం లేదన్న ఆయన.. సకాలంలో బకాయిలు చెల్లించకుంటే కర్షకులు నష్టపోతారని అన్నారు.

ధాన్యం సేకరణ, నగదు చెల్లింపుల్లో ఆలస్యం వద్దని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అధికారులకు సూచించారు. రైతుల సమస్యలు, ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులపై దిల్లీలో ఆహార, ప్రజాపంపిణీశాఖ మంత్రులు, అధికారులతో ఆయన చర్చించారు.

కేంద్రమంత్రులు తోమర్, పాశ్వాన్‌లతో మాట్లాడిన ఆయన.. కేంద్రం ఇచ్చిన మద్దతు ధర రైతులకు సరిగా అందడం లేదని అన్నారు. ఈ సందర్భంగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం జిల్లాలను ప్రస్తావించారు.

ధాన్యం కొనుగోలు చేసిన 4 రోజుల్లో నగదు చెల్లించాలని చెప్పారు. ధాన్యం తూకం హెచ్చుతగ్గులపై వచ్చే ఫిర్యాదులను గమనించాలని అన్నారు.

కేంద్ర అధికారులు.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడాలని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. నిధుల విడుదలపై పరిశీలిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments