Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ గాంధీపై కేసు.. భారత్ జోడో యాత్రలో అపశ్రుతి

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (21:52 IST)
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. భారత్ జోడో పాదయాత్రలో కేజీఎఫ్-2 పాటలను వినియోగిస్తున్నారంటూ రాహుల్ గాంధీతో పాటు తదితరులపై కేసు నమోదైంది. ఇందులో భాగంగా కేజీఎఫ్-2 పాటలపై హక్కులను కలిగివున్న బెంగళూరుకు చెందిన ఎమ్మార్టీ మ్యూజిక్ అనే మ్యూజిక్ ప్లాట్ ఫాం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
కేజీఎఫ్-2 హిందీ వెర్షన్ పాటలపై హక్కులను సొంతం చేసుకునేందుకు తాము భారీ మొత్తంలో చెల్లించామని, అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు తమ అనుమతిలేకుండా ఈ పాటలను వాడుకుంటున్నారని ఆరోపించింది. ఎమ్మార్టీ మ్యూజిక్ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
 
మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది.  ఈ భారత్ జోడో యాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. రాహుల్ భద్రతా విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ శివకుమార్ కాలిపై నుంచి రాహుల్ కాన్వాయ్‌లోని వాహనం వెళ్లింది. దీంతో, ఆయన గాయపడ్డారు. వెంటనే ఆయనను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments