Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొందిలో ప్రాణమున్నంత వరకు బెంగాల్‌లో సీఏఏ అమలు కాదు : సీఎం మమతా బెనర్జీ

వరుణ్
బుధవారం, 31 జనవరి 2024 (09:07 IST)
తన బొందిలో ప్రాణం ఉన్నంతవరకు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉమ్మడి పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు కానివ్వబోనని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు. దేశంలో సీసీఏ అమలుకు కేంద్రం చర్యలు చేపట్టింది. మరో వారం రోజుల్లో సీసీఏను అమలు చేస్తామంటూ కేంద్ర మంత్రులు చెబుతున్నారు. దీనిపై మమతా బెనర్జీ స్పందించారు. 
 
రాజకీయ అవకాశవాదంతో భారతీయ జనతా పార్టీ సీసీఏ అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తుందన్నారు. ఎవరి పౌరసత్వాన్ని లాక్కొనిపోయేందుకు అనుమతించేది లేదన్నారు. సీఏఏ, ఎన్ఆర్‌సీ, ఉమ్మడి పౌరస్మృతి వంటి అంశాలను బీజేపీ ఇపుడు చెప్పడం పూర్తిగా రాజకీయమేనన్నారు. బెంగాల్‌ సరిహద్దుల్లో ఉంటున్నవారందరికీ తాము పౌరసత్వం ఇచ్చామని, వారు ఓటు హక్కు వినియోగించుకోవడంతో పాటు అన్ని ప్రయోజనాలు పొందగలుగుతున్నారని చెప్పారు.
 
సరిదద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి బీఎస్ఎఫ్ ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇస్తుందంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అలాంటి కార్డులు స్వీకరించవద్దని హెచ్చిరంచారు. ఎన్ఆర్సీ ఉచ్చులో పడవేసేందుకు అవి సాధానాలు అవుతాయని చెప్పారు. అందువల్ల తాను బతికున్నంత వరకు బెంగాల్ రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం అమలు కానివ్వబోనని స్పష్టం చేశారు. మరికొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు రానున్న తరుణంలోనే బీజేపీ సీఏఏ పల్లవి అందుకుందని ఆమె ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం