Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటక రాష్ట్రంలో చోరీకి గురైన ఆర్టీసీ బస్సు..

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (10:02 IST)
కర్నాటక రాష్ట్రంలో ఒక ఆర్టీసీ బస్సు చోరీకి గురైంది. రాష్ట్రంలోని కలబురిగి జిల్లా చించోలి బస్టాండులో జరిగింది. ఇక్కడ పార్కింగ్ చేసివున్న కేఏ38 ఎఫ్971 అనే నంబరు కలిగిన ఈ బస్సు బీదర్ రెండో డిపోకు చెందినదిగా గుర్తించారు. ఇది ప్రతి రోజూ చించోలి - బీదర్ ప్రాంతాల మధ్య తిరుగుతుంది.
 
ఈ బస్సును గుర్తు తెలియని వ్యక్తి ఒకరు వచ్చి ఈ బస్సును అపహరించాడు. ఈ ఘటన మంగళవారం జరిగింది. మంగళవారం వేకువజామున 3.30 గంటల సమయంలో బస్టాండులోకి వచ్చిన ఓ అగంతకుడు ఈ బస్సను చాకచక్యంగా అపహరించాడు. ఇదంతా బస్టాండులోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. 
 
ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు చోరీకి గురైన బస్సు కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే, ఈ బస్సు తెలంగాణాలో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. ఆ బస్సును స్వాధీనం చేసుకున్నారు. ఈ బస్సును అపహరించిన దొంగలు.. తెలంగాణాలోని తాండూరు మీదుగా తీసుకెళ్ళినట్టు గుర్తించారు. అయితే, ఈ బస్సును డిపార్ట్‌మెంట్ వారే అపహరించినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments