Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో బుల్లెట్ రైలు... 14న శంకుస్థాపన

భారత్‌లో బుల్లెట్ రైలు పరుగు పెట్టనుంది. ఇందుకోసం సెప్టెంబరు 14వ తేదీన శుంకుస్థాపన చేయనున్నారు. దేశంలో తొలి బుల్లెట్ రైలు ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య నడుపనున్నారు. అయితే, ఈ బుల్లెట్ రైలు ప్రయాణం 2023 నా

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2017 (06:27 IST)
భారత్‌లో బుల్లెట్ రైలు పరుగు పెట్టనుంది. ఇందుకోసం సెప్టెంబరు 14వ తేదీన శుంకుస్థాపన చేయనున్నారు. దేశంలో తొలి బుల్లెట్ రైలు ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య నడుపనున్నారు. అయితే, ఈ బుల్లెట్ రైలు ప్రయాణం 2023 నాటికి అందుబాటులోకి రానుంది. ఈ రైలు గంటకు 320 కి.మీ వేగంతో దూసుకెళ్లనుంది. దీనిద్వారా ముంబై నుంచి అహ్మదాబాద్‌(508 కి.మీ)కు రెండు గంటల్లో చేరుకోవచ్చు. 
 
కాగా, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం సెప్టెంబరు 14వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని సబర్మతీ రైల్వే స్టేషన్‌ సమీపంలో జరుగనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు జపాన్ ప్రధాని షింజో అబే కూడా పాల్గొననున్నారు. సుమారు రూ.98,000 కోట్ల వ్యయంతో చేపడుతున్న బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు వ్యయంలో 81 శాతాన్ని జపాన్‌ రుణంగా సమకూర్చనుంది. 
 
ఈ కార్యక్రమంలో భాగంగా ఇరుదేశాలు పలు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు శంకుస్థాపన కోసం సెప్టెంబర్‌ 13న గుజరాత్‌కు మోడీ, అబేలు చేరుకుంటారు. ఈ సందర్భంగా వీరిద్దరు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments