Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో బుల్లెట్ రైలు... 14న శంకుస్థాపన

భారత్‌లో బుల్లెట్ రైలు పరుగు పెట్టనుంది. ఇందుకోసం సెప్టెంబరు 14వ తేదీన శుంకుస్థాపన చేయనున్నారు. దేశంలో తొలి బుల్లెట్ రైలు ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య నడుపనున్నారు. అయితే, ఈ బుల్లెట్ రైలు ప్రయాణం 2023 నా

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2017 (06:27 IST)
భారత్‌లో బుల్లెట్ రైలు పరుగు పెట్టనుంది. ఇందుకోసం సెప్టెంబరు 14వ తేదీన శుంకుస్థాపన చేయనున్నారు. దేశంలో తొలి బుల్లెట్ రైలు ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య నడుపనున్నారు. అయితే, ఈ బుల్లెట్ రైలు ప్రయాణం 2023 నాటికి అందుబాటులోకి రానుంది. ఈ రైలు గంటకు 320 కి.మీ వేగంతో దూసుకెళ్లనుంది. దీనిద్వారా ముంబై నుంచి అహ్మదాబాద్‌(508 కి.మీ)కు రెండు గంటల్లో చేరుకోవచ్చు. 
 
కాగా, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం సెప్టెంబరు 14వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని సబర్మతీ రైల్వే స్టేషన్‌ సమీపంలో జరుగనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు జపాన్ ప్రధాని షింజో అబే కూడా పాల్గొననున్నారు. సుమారు రూ.98,000 కోట్ల వ్యయంతో చేపడుతున్న బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు వ్యయంలో 81 శాతాన్ని జపాన్‌ రుణంగా సమకూర్చనుంది. 
 
ఈ కార్యక్రమంలో భాగంగా ఇరుదేశాలు పలు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు శంకుస్థాపన కోసం సెప్టెంబర్‌ 13న గుజరాత్‌కు మోడీ, అబేలు చేరుకుంటారు. ఈ సందర్భంగా వీరిద్దరు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments