Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరిమళించిన మానవత్వం.. మహారాష్ట్ర మంత్రి ఏం చేశారో తెలుసా?

మహారాష్ట్ర రాజధాని ముంబైతో పాటు.. ఆ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు వరద ముంపులో చిక్కుకునిపోయాయి. ఫలితంగా లక్షలాది మంది ముంబై వాసులు ఆశ్రయాన్ని కోల్పోయారు. వరద నీటిలో గృహాలు మునిగిపోవడంతో ఏం చేయాలో, ఎక్కడ

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2017 (06:17 IST)
మహారాష్ట్ర రాజధాని ముంబైతో పాటు.. ఆ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు వరద ముంపులో చిక్కుకునిపోయాయి. ఫలితంగా లక్షలాది మంది ముంబై వాసులు ఆశ్రయాన్ని కోల్పోయారు. వరద నీటిలో గృహాలు మునిగిపోవడంతో ఏం చేయాలో, ఎక్కడ ఉండాలో దిక్కుతోచక తల్లడిల్లిపోతున్నారు. 
 
ముఖ్యంగా.. ముంబైలో కురిసిన భారీ వర్షాల కారణంగా రహదారులపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో మహారాష్ట్ర మంత్రి గిరీశ్ బపత్ తన మానవత్వం చాటుకున్నారు. దక్షిణ ముంబైలో తన నివాసానికి పరిసరాల్లో ఉన్న ఫోర్ట్, మంత్రాలయ దగ్గర చిక్కుకుపోయిన ప్రజలను తన ఇంటికి వచ్చి సేద తీరాల్సిందిగా కోరారు. 
 
ఈ మేరకు గిరీశ్ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ప్రజలకు విన్నవించుకున్నారు. కాగా, ముంబైలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రవాణా వ్యవస్థ స్తంభించడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే, పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments