Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోపాక్ సరిహద్దుల్లో రూ.270 కోట్ల హెరాయిన్ పట్టివేత

Webdunia
శుక్రవారం, 4 జూన్ 2021 (10:00 IST)
భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో 270 కోట్ల రూపాయల విలువ చేసే మాదకద్రవ్యాలను ఇండియన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. ఇందులో అధికంగా హెరాయిన్ వుంది. దీన్ని పైపుల ద్వారా భారత్‌లోకి  పాకిస్థాన్ స్మగ్లర్లు అక్రమంగా చేరవేస్తున్నట్టు తేలింది. 
 
భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద రాజస్థాన్‌లో జరిగిందీ ఘటన. బికనేర్‌లోని కాజూవాలా ప్రాంతంలో నిన్న భారీ వర్షం కురిసింది. దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్న పాక్ స్మగ్లర్లు పీవీసీ పైపుల ద్వారా భారత్‌లోకి పెద్ద ఎత్తున హెరాయిన్‌ను పంపేందుకు ప్లాన్ వేశారు. 
 
ఈ విషయం తెలుసున్న భారత సరిహద్దు దళం (బీఎస్ఎఫ్) బలగాలు వెంటనే అప్రమత్తమై స్మగ్లర్లపై కాల్పులు ప్రారంభించాయి. అనంతరం నిర్వహించిన సోదాల్లో 54 ప్యాకెట్లలో 58.6 కిలోల బరువున్న హెరాయిన్‌ లభ్యమైంది. దీని విలువ రూ.270 కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఇంత పెద్దమొత్తంలో మత్తుపదార్థాలు పట్టుబడడం ఇదే తొలిసారని బీఎస్ఎఫ్ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments