Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం : ఉపాధ్యాయుడికి దేహశుద్ధి

ఠాగూర్
బుధవారం, 25 సెప్టెంబరు 2024 (16:37 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహ్ముదాబాద్‌లో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పించి చిన్నారులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడే కీచకుడిలా మారిపోయాడు. 11 ఏళ్ల బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారానికి ఒడిగట్టిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణానికి ఒడిగట్టింది పీఈటీ టీచర్ కావడం గమనార్హం. 
 
పోలీసుల కథనం మేరకు.. మంగళవారం స్కూల్‌కు వెళ్లిన బాలిక పాఠశాల సమయం ముగిసినా ఇంటికి రాకపోవడంతో తండ్రి ఆమె కోసం వెతికాడు. బాలిక అదృశ్యమైన విషయం తెలుసుకున్న స్థానికులు ఉపాధ్యాయుడు సంజయ్‌ గుప్తా ఇంటి తలుపులు పగలగొట్టి.. బాలికను రక్షించారు. అనంతరం అతడిని చితకబాదారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని టీచర్‌ సంజయ్‌ గుప్తాను అరెస్టు చేశారు. 
 
స్థానికుల దాడిలో తీవ్ర గాయాలపాలైన అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఆస్పత్రికి తరలిస్తున్నట్లు మహ్ముదాబాద్‌ పోలీస్‌ అధికారి దినేశ్‌ శుక్లా వెల్లడించారు. గుప్తా బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని.. తన కోర్కెలు తీర్చకపోతే కొట్టడంతో పాటు స్కూల్‌లో ఫెయిల్‌ చేస్తానని బెదిరించాడని తెలిపారు. తమకు అందిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం