Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తారింటికి వెళుతూ నదిలో దూకేసిన నవవధువు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 15 జూన్ 2020 (13:34 IST)
ఆమెకు ఇష్టంలేని పెళ్లి చేశారో లేక వరుడు నచ్చలేదో తెలియదు గానీ.. పెళ్లి మండపం నుంచి అత్తారింటికి బయలుదేరిన నవ వధువు మార్గమధ్యంలో నదిలో దూకేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ సమీపంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాజస్థాన్‌ రాష్ట్రంలోని అలాపుర్‌కు చెందిన ఓ యువతికి ఆదివారం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువకుడితో వివాహమైంది. ఆ తర్వాత అమ్మాయిని అత్తారింటికి పంపే వేడుక కూడా ఘనంగానే జరిగింది. 
 
ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత తన భర్త, అత్తమామలతో కలిసి మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని తన అత్తారింటికి నవ వధువు  బయలుదేరింది. అయితే, షియోపూర్ చంబల్ నదిపై వాహనం వెళుతున్న వేళ, ఆమె తనకు వాంతి వస్తోందని చెప్పింది. కారును ఆపాలని కోరినా, డ్రైవర్ ఆపకుండా పోతుంటే, స్టీరింగ్‌ను గట్టిగా పట్టుకోవడంతో, డ్రైవర్ బ్రేకులు వేశాడు.
 
ఆ వెంటనే వాహనాన్ని దిగిన ఆమె, వాహనంలోని భర్త, ఇతరులకు ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే చంబల్ నదిలో దూకేసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి పెళ్లయిన తర్వాత కూడా ఆమె బాగానే ఉందని, ఇంతలోనే ఏమైందో తమకు అర్థం కావడం లేదని వధువు తండ్రి వాపోయాడు. ఈ విషయంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటి సనా ఖాన్‌కు మాతృవియోగం

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments