Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లాక్ డౌన్‌: భర్త దూరంగా ఉన్నాడని కొండపై నుంచి దూకేసిన భార్య

లాక్ డౌన్‌: భర్త దూరంగా ఉన్నాడని కొండపై నుంచి దూకేసిన భార్య
, శనివారం, 30 మే 2020 (14:49 IST)
భర్త బెంగుళూరులో.. భార్య ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లెలో. లాక్ డౌన్‌తో ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. భర్త లేకుండా ఉండలేని భార్య ఆవేదనతో తీవ్ర మనస్థాపం చెంది కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
 
వారిద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితి. అయితే లాక్‌డౌన్ వారిద్దరినీ వేరు చేసింది. మదనపల్లెలోని వేంపల్లి పంచాయతీ మల్లయ్యకొండ వద్ద ఉన్న బాలాజీనగర్‌లో అత్తమామల ఇంటికి వచ్చింది భార్య సుజనకుమారి. 
 
అప్పుడే లాక్ డౌన్ స్టార్టయ్యింది. బెంగుళూరుకు వెళ్ళలేక అత్తమామతో కలిసి ఉండేది. భర్త విశ్వనాథ్‌తో తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. ఎలాగైనా మదనపల్లెకి వచ్చేయ్యమని భర్తను కోరింది. అయితే రాష్ట్ర సరిహద్దులో పంపించరని.. భార్యకు నచ్చచెబుతూ వచ్చాడు భర్త.
 
భర్త లేకుండా ఒంటరి జీవితాన్ని అనుభవించలేని భార్య తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ రోజు అత్త, మామలతో కలిసి మల్లయ్య కొండకు వెళ్ళింది. అత్త, మామలు కొండపై నమస్కారం చేస్తుండగా వారి కళ్ళు గప్పి అక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్లి లోయలోకి దూకేసింది సుజన. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీకాళహస్తిలో కరోనా రోగికి దేవదాయశాఖ గది కేటాయింపు