పాకిస్థాన్‌ కంటిమీద కునుకులేకుండా చేసిన బ్రహ్మోస్ అస్త్రాలు : ప్రధాని మోడీ

ఠాగూర్
శుక్రవారం, 30 మే 2025 (17:55 IST)
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత సైన్యం ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణి దెబ్బకు పాకిస్థాన్ విలవిల్లాడిందని, బ్రహ్మోస్ మిస్సైల్స్ పాకిస్థాన్ పాలకులకు నిద్రలేని రాత్రులను మిగిల్చిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పాకిస్థాన్‌ భూభాగంలో వందల మైళ్లు చొచ్చుకెళ్లి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయని ఆయన చెప్పారు. అలాగే, భారత్ క్షిపణులు తమ లక్ష్యాలను పక్కాగా ఛేదించాయని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా అంగీకరించారని చెప్పారు. 
 
యూపీలోని కాన్పూర్‌లో ఆయన వివిధ రకాల అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, మనం పాకిస్థాన్‌లోని వందల మైళ్లు చొచ్చుకెళ్లి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాం అని ప్రకటించారు. మన సాయుధ బలగాలు విరోచిత చర్యలతో పాకిస్థాన్ సైన్యం యుద్ధాన్ని ఆపమని శరణు వేడుకోవాల్సి వచ్చిందన్నారు. 
 
ఆపరేషన్ సిందూర్‍తో భారత సైనిక శక్తి ప్రపంచానికి చాటి చెప్పడం జరిగిందన్నారు. ముఖ్యంగా, బ్రహ్మోస్ క్షిపణి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉందన్నారు. బ్రహ్మోస్ మిస్సైల్స్ పాకిస్థాన్ సైన్యానికి నిద్రలేని రాత్రులు మిగిల్చిందన్నారు. 
 
కాగా, భారత్ మే 9, 10వ తేదీ రాత్రుల్లో బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించి, తమ దేశంలోని లక్ష్యాలను ఛేదించాయని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ధృవీకరించిన నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా, మే 10వ తేదీన పాకిస్థాన్‌లోని రావల్పిండిలో ఉన్న నూర్ ఖాన్ వైమానిక స్థావరం, ఇతర లక్ష్యాలను బ్రహ్మోస్ క్షిపణులు తాకాయని ఆయన వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments