అమరావతి ఎంపీకి వీడని కష్టాలు... వారం రోజుల్లో కూల్చివేయాలంటూ...

Webdunia
శనివారం, 21 మే 2022 (19:36 IST)
మహారాష్ట్రలోని అమరావతి బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ దంపతులకు ఇప్పట్లో కష్టాలు వీడేలా కనిపించడం లేదు. ఇప్పటికే హనుమాన్ చాలీసా పఠనంపై చెలరేగిన వివాదంలో అరెస్టు అయిన నవనీత్ కౌర్ దంపతులు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. ఇపుడు మరో కష్టం వచ్చిపడింది. 
 
ముంబై నగర పరిధిలోని ఖర్ ఏరియాలో నవనీత్ కౌర్ ఇంటిలో కొంతభాగం అక్రమంగా నిర్మించారంటూ ముంబై నగర పాలక సంస్థ ఆమెకు నోటీసులు జారీచేసింది. ఈ అక్రమ నిర్మాణాన్ని వారం రోజుల్లో కూల్చివేయాలని లేనిపక్షంలో తామే కూల్చివేస్తామని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 
 
కాగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే హనుమాన్ చాలీసా పఠించాలని డిమాండ్ చేసిన కౌర్‌ అందుకు ఆయన సమ్మతించకపోతే ఆయన ఇంటి ముందు బైఠాయించి హనుమాన్ చాలీసాను పఠిస్తానంటూ హెచ్చరికలు చేశారు. 
 
ఈ క్రమంలో సీఎం ఇంటికి వెళతారన్న అనుమానంతో కౌర్ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆ దంపతులకు పది రోజుల తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ పది రోజుల పాటు వారు జైలు జీవితం గడిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Fariya: కొత్తగా కంటెంట్ వినగానే నటించాలని అనిపించింది : ఫరియా అబ్దుల్లా

Akhanda 2 అఖండ 2 సినిమా విడుదల తనకు బ్యాడ్ లక్ అంటున్న దర్శకుడు

Ravi Teja: అద్దం ముందు.. పాటలో రవితేజ, డింపుల్ హయతి

Japan Earthquake: డార్లింగ్ ప్రభాస్ ఎక్కడ..? మారుతి ఏమన్నారు?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments