Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రపతి ఎన్నికల్లోనూ బేరసారాలకు దిగిన బీజేపీ : యశ్వంత్ సిన్హా

Webdunia
శుక్రవారం, 15 జులై 2022 (09:02 IST)
దేశ ప్రథమ పౌరుడు ఎన్నికలను కూడా భారతీయ జనతా పార్టీ అతి సాధారణ ఎన్నికలుగా భావించి, ఈ ఎన్నికల్లో కూడా బేరసారాలకు దిగిందని ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఆరోపించారు. ఇందుకోసం ఆయన ఆపరేషన్ కమల్‌ను ప్రారంభించిందని తెలిపారు. 
 
ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం, రాజ్యసభ ప్రధాన కార్యదర్శి (రాష్ట్రపతి ఎన్నికకు ఆర్వో) ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. తనకున్న విశ్వసనీయ సమాచారం మేరకు.. ఈ ఆపరేషన్‌లో భాగంగా భాజపాయేతర శాసనసభ్యులకు పెద్దమొత్తంలో డబ్బులు అందజేస్తున్నారని ఆరోపించారు. 
 
'కమలం' భాజపా ఎన్నికల గుర్తు అన్న విషయం తెలిసిందే. గురువారం భోపాల్‌లో కాంగ్రెస్‌ శాసనసభ్యులతో భేటీ అనంతరం యశ్వంత్‌సిన్హా మీడియాతో మాట్లాడారు. 'ఈరోజు ఉదయం మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్తను చూసి నేను విస్తుపోయా. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 26 మంది గిరిజన ఎమ్మెల్యేలపై భాజపా కన్ను పడిందని, క్రాస్‌ ఓటింగుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నది ఆ వార్త సారాంశం' అన్నారు. 
 
ఆపరేషన్‌ కమల్‌కు సరైన పేరు 'ఆపరేషన్‌ మురికి' అని అభివర్ణించారు. ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు, ప్రతిపక్షాల నడుమ స్పర్థలు తెచ్చేందుకు భాజపా ఇటువంటి మురికి రాజకీయాలకు పాల్పడుతోందని సిన్హా ధ్వజమెత్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments