Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్కే నగర్ బై పోల్ ... గెలుపు ఆయనదే : స్వామి జోస్యం

చెన్నై ఆర్.కె.నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీటీవీ దినకరన్‌ విజయం సాధించడం తథ్యమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి జోస్యం చెప్పారు.

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2017 (16:05 IST)
చెన్నై ఆర్.కె.నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీటీవీ దినకరన్‌ విజయం సాధించడం తథ్యమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి జోస్యం చెప్పారు. ఆ స్థానం ఉప ఎన్నికల పోలింగ్ గురువారం జరుగనుంది. 
 
ఈ నేపథ్యంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో దినకరన్‌ గెలిచి డీఎంకే నేత స్టాలిన్‌కు గుణపాఠం చెబుతారన్నారు. దినకరన్‌కు, డీఎంకేకు అధికార పార్టీ అస‌లు పోటీనే కాద‌ని చెప్పారు. 
 
త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం రాష్ట్రానికి ఎటువంటి మంచి పనులు చేయలేదని, వారిద్ద‌రూ అసమర్థులని అన్నారు. డీఎంకే పార్టీ హిట్లర్‌ పార్టీ అని, దాని నుంచి దిన‌క‌ర‌న్ మాత్ర‌మే ప్రజలను కాపాడగల‌డ‌ని అన్నారు.
 
కాగా, ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి ఈ.మధుసూదనన్ పోటీ చేస్తుండగా, డీఎంకే తరపున మరుద గణేష్, స్వతంత్ర అభ్యర్థి టీటీవీ దినకరన్‌తో పాటు.. మరికొంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్న విషయం తెల్సందే.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments