Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టిడీపి మాకు సీట్లు కేటాయించడం ఏంటి? మేమే వారికిస్తాం అంటున్న భాజపా నేత

అక్కడెక్కడో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాలలో బిజెపి గెలిస్తే మిగిలిన అన్ని రాష్ట్రాల్లో బిజెపికి తిరుగులేదని బిజెపి నాయకులు చెబుతున్నారు. ఎపికి చెందిన ఒక బిజెపి నేత మాత్రం ఎపిలో రాజకీయాలను మేమే శాసిస్తాం.. మాకు తిరుగులేదు. టిడిపితో మాకు పొత్తు ఉ

టిడీపి మాకు సీట్లు కేటాయించడం ఏంటి? మేమే వారికిస్తాం అంటున్న భాజపా నేత
, మంగళవారం, 19 డిశెంబరు 2017 (15:31 IST)
అక్కడెక్కడో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాలలో బిజెపి గెలిస్తే మిగిలిన అన్ని రాష్ట్రాల్లో బిజెపికి తిరుగులేదని బిజెపి నాయకులు చెబుతున్నారు. ఎపికి చెందిన ఒక బిజెపి నేత మాత్రం ఎపిలో రాజకీయాలను మేమే శాసిస్తాం.. మాకు తిరుగులేదు. టిడిపితో మాకు పొత్తు ఉండొచ్చు కానీ.. పొత్తుతో పని అవసరం ఉండకపోవచ్చు. బిజెపిపై దేశ ప్రజల్లో ఎంతో నమ్మకం పెరిగింది. ప్రధాని ప్రవేశపెట్టిన పథకాలు పూర్తిస్థాయిలో అమలు అవుతున్నాయని చెప్పారు. 
 
ఎపిలోనే కాదు తెలంగాణా రాష్ట్రంలోను అధికారం మాదే. వచ్చే ఎన్నికల్లో బిజెపి జెండాను ఎగురవేస్తాం అని చెప్పారు బిజెపి నేత సోము వీర్రాజు. బిజెపిలో ఉన్న సోము వీర్రాజు ఆ పార్టీ గురించి గొప్పగా చెప్పుకుంటే ఫర్వాలేదు గానీ పొత్తు పెట్టుకున్న టిడిపిని చాలా హీనంగా మాట్లాడటమే ఇప్పుడు టిడిపి నేతలను ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. 
 
టిడిపి నేతలు మాకు సీట్లు కేటాయించడం ఏమిటి. మేము వారికి సీట్లు కేటాయిస్తాం. మేము చెప్పిన చోటికే వారు వెళ్ళాలి. ఇలా సోము వీర్రాజు మాట్లాడటం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి కూడా వెళ్ళింది. మరి సిఎం ఏ విధంగా స్పందిస్తారన్నదే ఆసక్తిగా మారుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ మంత్రి అమరనాథరెడ్డిని ఆ అవ్వ చేయి పట్టుకుని లాక్కెళ్లి..?