Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ముస్లింలను అణిచివేసేందుకు బీజేపీ కుట్ర: అగ్నివేష్‌

Webdunia
శనివారం, 1 ఫిబ్రవరి 2020 (08:49 IST)
దేశంలో ముస్లింలను అణిచివేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని సామాజిక వేత్త అగ్నివేష్‌ ధ్వజమెత్తారు. విజయవాడలో సీఏఏ, ఎన్‌ఆర్సీకి వ్యతిరేకంగా ప్రజాగర్జన సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందు, ముస్లింల మధ్య బీజేపీ విబేధాలు సృష్టిస్తోందని ఆరోపించారు. గాడ్సే వారసులమని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ రుజువు చేసుకున్నాయని అగ్నివేష్‌ చెప్పారు. ఈ సభలో స్వామి అగ్నివేష్‌, సీపీఐ నేత రామకృష్ణ, కేశినేని, గద్దె రామ్మోహన్‌ హాజరైనారు.
 
రాష్ట్రపతి ప్రసంగంలో సీఏఏ ప్రస్తావన
పార్లమెంటు బడ్జెట్​ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ప్రసంగిస్తూ సీఏఏ అంశాన్ని ప్రస్తావించగానే సభ ఒక్కసారిగా దద్దరిల్లింది. విపక్షాల నినాదాలతో సభ మార్మోగింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ పౌరసత్వ చట్టాన్ని ప్రస్తావించగానే విపక్ష సభ్యులు తీవ్రంగా స్పందించారు. నినాదాలతో సభను హోరెత్తిస్తూ కాసేపు గందరగోళం సృష్టించారు. అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగించారు రాష్ట్రపతి. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments