Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై టాక్సీలుగా ద్విచక్రవాహనాలు!

Webdunia
ఆదివారం, 29 నవంబరు 2020 (18:50 IST)
దేశవ్యాప్తంగా వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎలక్ట్రిక్‌, బయో ఇంధనంతో పనిచేసే ద్విచక్రవాహనాలను టాక్సీలుగా వినియోగించేందుకు ప్రత్యేక అనుమతులు ఇవ్వనున్నట్లు రోడ్లు, రవాణా రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు.

ఈ వాహనాలకు మీటర్‌ కూడా ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. ఎఫ్‌ఎడిఎ పాలకమండలి సభ్యులతో జరిగిన తాజా సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఎలక్ట్రిక్‌, అత్యున్నత నాణ్యత కలిగిన వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన ఫేమ్‌ (ఎఫ్‌ఎఎంఇ) పథకం రెండోదశలో భాగంగా వీటిని అనుమతించామన్నారు.

పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రజలంతా ఎలక్ట్రిక్‌ వాహనాలను వినియోగించేలా చర్యలను వేగవంతం చేయనున్నట్లు నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న 69వేల పెట్రోల్‌ బంకుల్లో చార్జింగ్‌ కిట్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ముంబయి, కోల్‌కతా, చెన్నై వంటి నగరాల్లో స్టేషన్‌, లేదా విమానాశ్రయాలకు వెళ్లాలనుకునే వారికి ఈ ద్విచక్ర టాక్సీలు ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. వీటికోసం ప్రత్యేకంగా నిబంధనలను జారీ చేస్తామని, ఈ పథకం ఫలవంతమైతే మంచి వ్యాపారం అవుతుందని సూచించారు.

అలాగే ఎలక్ట్రిక్‌ ట్రాలీ బస్సులను కూడా ప్రవేశపెట్టనున్నట్లు గడ్కరీ పేర్కొన్నారు. విద్యుత్‌పై పనిచేసే ఈ బస్సులు తక్కువ ఖర్చుతో ఆర్థికంగా లాభదాయకమని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments