Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేనకోడలిపై మనసు పారేసుకున్న అత్త.. భర్తను వదిలేసి డుం డుం డుం

సెల్వి
మంగళవారం, 13 ఆగస్టు 2024 (11:25 IST)
women marriage
బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో ఇద్దరు మహిళల వివాహానికి సంబంధించిన వింత ఉదంతం వెలుగులోకి వచ్చింది. మేనకోడలిపై మనసు పారేసుకున్న అత్త భర్తను వదిలేసింది. అంతే మేనకోడలిని వివాహం చేసుకుంది. వీరిద్దరి ప్రేమ వ్యవహారం గత మూడేళ్లుగా నడుస్తోంది. 
 
మేనకోడలికి వేరే చోట పెళ్లి జరుగుతుందని తెలుసుకున్న అత్త పెళ్లి నిర్ణయం తీసుకుంది. ఈ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
బెల్వా నివాసి అత్త సుమన్, మేనకోడలు శోభ ఇద్దరూ కుచయ్‌కోట్ పోలీస్ స్టేషన్‌లోని ససముసాలోని దుర్గా భవాని ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఈ వింత వివాహం చర్చనీయాంశంగా మారింది. 
 
ఆలయంలో వివాహ వేడుకల్లో అన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ఇద్దరూ దండలు మార్చుకున్నారు. మెడలో మంగళసూత్రం కట్టుకున్నారు. ఆపై సింధూర్ ధరించి, అగ్ని సాక్షిగా ఏడడుగులు వేశారు. ఎప్పటికీ ఒకరికొకరు అండగా వుంటారని వాగ్ధానం చేసుకున్నారు. 
 
"పెళ్లయ్యాక మేమిద్దరం కలిసి జీవిస్తాం, చనిపోతామని ప్రమాణం చేశాం." అంటూ చెప్పారు.  సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేయడం ద్వారా తమ పెళ్లి గురించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆ వీడియోలో ఇద్దరూ తమ ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నామని, కలకాలం కలిసి ఉంటామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments