Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ కల్యాణ్‌కి 3 పెళ్లిళ్లు ఎందుకయ్యాయో ఇప్పుడర్థమైందంటున్న దువ్వాడ

pawan kalyan-Duvvada Srinivas

ఐవీఆర్

, శనివారం, 10 ఆగస్టు 2024 (20:23 IST)
జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ 3 పెళ్లిళ్లు వ్యవహారంపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గతంలో ఓ స్థాయిలో విమర్శలు సంధించారు. ఐతే తాజాగా వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు పవన్ పెళ్లిళ్ల వ్యవహారంపై స్పందించారు. తనకు ప్రస్తుతం ఎదురవుతున్న పరిస్థితిని బట్టి చూస్తే... పవన్ అలా ఎందుకు మూడు వివాహాలు చేసుకోవాల్సి వచ్చి వుంటుందో అర్థమవుతోందన్నారు. పవన్ కల్యాణ్ కు ఎదురైన పరిస్థితి ఏమిటో నాకిప్పుడు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోందని చెప్పుకొచ్చారు. మరోవైపు ఆయనతో జీవనం సాగిస్తున్న మాధురి మాట్లాడుతూ... తను చిన్నప్పట్నుంచి పవన్ కల్యాణ్ అభిమానినని అన్నారు. ఆయన గురించి ఇప్పటివరకూ పల్లెత్తు మాట అనలేదని వెల్లడించారు.
 
వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిపై వచ్చిన డీఎన్ఏ ఆరోపణలే ఇంకా చల్లారకముందే.. అదే రాజకీయ పార్టీకి చెందిన ఓ ప్రముఖ నేత వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మరో ఇబ్బందికర అంశం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి తప్పుడు కారణాలతో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వార్తల్లో నిలిచారు. దువ్వాడ శ్రీనివాస్ గత కొంతకాలంగా దివ్వల మాధురితో అక్రమ సంబంధం కలిగి ఉన్నారంటూ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఇద్దరు కుమార్తెలు, భార్య వాణికి దూరంగా ఉంటున్నారు.
 
గురువారం సాయంత్రం, అతని కుమార్తెలు, నవీనా, హైందవి ఇద్దరూ బయటకు వచ్చి, మాధురితో శ్రీనివాస్‌కు ఉన్న అక్రమ సంబంధాన్ని బట్టబయలు చేశారు. మాధురి ఇంటి వద్ద శ్రీనివాస్‌ను కలిసేందుకు ప్రయత్నించి అర్ధరాత్రి వరకు గేటు బయటే వేచి ఉన్నారు. అయితే శ్రీనివాస్ ఇంటి నుంచి బయటకు రాలేదు. తమ తండ్రి తమ తల్లి వాణితో చట్టబద్ధంగా విడాకులు తీసుకోకుండా మాధురితో కలిసి జీవిస్తున్నారని కుమార్తెలిద్దరూ ఆరోపించారు. డబ్బు కోసమే శ్రీనివాస్‌ను మాధురి ట్రాప్ చేసిందని ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్ గత రెండేళ్లుగా తమ నుంచి తప్పించుకుంటూ తిరుగుతూ మాధురి కుటుంబంతో కలిసి జీవిస్తున్నారని హైందవి, నవీన ఆరోపించారు.
 
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి ఎమ్మెల్యేగా దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేసి టీడీపీ అభ్యర్థి అచ్చున్నాయుడు చేతిలో ఓడిపోయారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనను ఎమ్మెల్సీని చేసి 2024 ఎన్నికల్లో టెక్కలి నుంచి పోటీ చేసేందుకు టిక్కెట్ ఇచ్చారు.
 
దువ్వాడ శ్రీనివాస్‌, అతని భార్య వాణిల మధ్య కొన్నేళ్లుగా విభేదాలు ఉన్నాయి. అయితే, వారు విడాకులు తీసుకోలేదు కానీ విడిగా జీవించడం ప్రారంభించారు. ఇప్పుడు, మాధురితో దువ్వాడ అక్రమ సంబంధాన్ని అతని కుమార్తెలు బహిర్గతం చేశారు. కాగా, మీడియాలో జరుగుతున్న కథనాలపై దివ్వల మాధురి ఘాటుగా స్పందించింది. తనను ఈ ఇష్యూలోకి లాగవద్దని అందరికి విజ్ఞప్తి చేశారు. శ్రీనివాస్ తన కుటుంబ విషయాలను భార్య , కూతుళ్లతో పరిష్కరించి ఈ వేధింపులను ఆపాలని ఆమె అన్నారు. తాను శ్రీనివాస్‌తో కలిసి జీవిస్తున్నానని, తన భర్త నుండి విడిపోయిన కష్ట సమయాల్లో తనకు గొప్ప సహాయాన్ని అందించాడని మాధురి స్పష్టం చేశారు. 
 
శ్రీనివాస్‌తో తనది అక్రమ సంబంధం కాదని మాధురి అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న కుటుంబ కలహాలపై దువ్వాడ శ్రీనివాస్ స్పందిస్తూ.. అధికార పార్టీ నేతల మద్దతుతో ఇటీవలి ఎన్నికల తర్వాత తన కుమార్తెలు, తన భార్య ఇద్దరూ ఉద్దేశ్యపూర్వకంగా తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. తాను గత రెండేళ్లుగా మాధురితో కలిసి ప్రస్తుత ఇంట్లోనే ఉంటున్నానని, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే తన ప్రతిష్టను దిగజార్చడం ప్రారంభించారని ఎమ్మెల్సీ అన్నారు. నిరాశాజనక ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పటికే అనేక సమస్యలతో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దువ్వాడ అంశం మరో తలనొప్పిగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మనీ యాప్ మోసాలు: రూ.74 వేలు కట్టాను. రూ. 20వేలే వెనక్కి, నమ్మించి మోసం చేశారు