మహారాష్ట్రలో కూలిన మూడు అంతస్తుల భవనం.. ముగ్గురి మృతి

Webdunia
ఆదివారం, 30 ఏప్రియల్ 2023 (13:20 IST)
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ భవనం కూలిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. థానే జిల్లా భివాండి ప్రాంతంలో ఓ పాత భవనం కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఐదేళ్ల చిన్నారి కూడా ఉంది. ఈ శిథిలాల నుంచి 12 మంది సురక్షితంగా రక్షించారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు. మృతులను నవనాథఅ సావంత్ (40), లక్ష్మదేవి రవి మటో (26), సోనా ముఖేశ్ (5)లుగా ఉన్నారు. 
 
మహారాష్ట్రలోని థానే జిల్లాలో భివాండిలో వర్ధమాన్ కాంపౌండ్‌లో మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో గ్రౌండ్ ప్లస్ మూడు అంతస్తుల భవనం కూలిపోయింది. ఆ సమయంలో కింద అంతస్తులో పని చేస్తున్న కార్మికులు, రెండో అంతస్తులో నివసిస్తున్న కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకు పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో దాదాపు 22 మంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. 
 
మంత్రి కపిల్ పాటిల్, థానె కలెక్టర్ అశోక్ సింగరే, అసిస్టెంట్ కమిషనర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే రూ.5 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే, క్షతగాత్రులకు ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

The Girlfriend Review : రష్మిక మందన్నా నటించిన ది గాళ్ ఫ్రెండ్ రివ్యూ

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments