Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో కూలిన మూడు అంతస్తుల భవనం.. ముగ్గురి మృతి

Webdunia
ఆదివారం, 30 ఏప్రియల్ 2023 (13:20 IST)
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ భవనం కూలిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. థానే జిల్లా భివాండి ప్రాంతంలో ఓ పాత భవనం కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఐదేళ్ల చిన్నారి కూడా ఉంది. ఈ శిథిలాల నుంచి 12 మంది సురక్షితంగా రక్షించారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు. మృతులను నవనాథఅ సావంత్ (40), లక్ష్మదేవి రవి మటో (26), సోనా ముఖేశ్ (5)లుగా ఉన్నారు. 
 
మహారాష్ట్రలోని థానే జిల్లాలో భివాండిలో వర్ధమాన్ కాంపౌండ్‌లో మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో గ్రౌండ్ ప్లస్ మూడు అంతస్తుల భవనం కూలిపోయింది. ఆ సమయంలో కింద అంతస్తులో పని చేస్తున్న కార్మికులు, రెండో అంతస్తులో నివసిస్తున్న కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకు పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో దాదాపు 22 మంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. 
 
మంత్రి కపిల్ పాటిల్, థానె కలెక్టర్ అశోక్ సింగరే, అసిస్టెంట్ కమిషనర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే రూ.5 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే, క్షతగాత్రులకు ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments