Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా మరో 5,874 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 30 ఏప్రియల్ 2023 (12:51 IST)
దేశంలో కొత్తగా మరో 5,874 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారంతో పోల్చితే రోజువారీ కరోనా కేసుల నమోదులో తగ్గుదల కనిపించింది. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం 5,874 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ తాజా కేసులతో కలుపుకుంటే దేశంలో మొత్తం క్రియాశీలక కేసుల సంఖ్య 50 వేలకు దిగువకు చేరుకున్నాయి. 
 
అదేవిధంగా జాతీయ స్థాయిలో కరోనా వైరస్ బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య 98.71 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 49,015గా ఉంది. శనివారం నాడు రోజువారీ కేసుల సంఖ్య 7,171గా ఉన్న విషయం తెల్సిందే. 
 
ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 3.31 సాతంగా ఉండగా, వారం రోజుల సగటు పాజిటివిటీ రేటు 4.25 శాతంగా ఉన్నట్టు కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో కరోనా నుంచి 8,148 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,43,64,841కు చేరింది. జాతీయ స్థాయిలో సగటు రికవరీ శాతం 98.71 శాతంగా ఉండగా మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments