Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైఎస్ఆర్ ఇపుడు నిజంగానే చనిపోయారు : సీపీఐ రామకృష్ణ

ramakrishna
, బుధవారం, 26 ఏప్రియల్ 2023 (09:42 IST)
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిజంగా ఇపుడు చనిపోయారని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. తమ కుటుంబ పరువును బజారులో పడేసిన కుటుంబ సభ్యులను చూసి వైఎస్ఆర్ ఆత్మ ఘోషించివుంటుందని చెప్పారు. 
 
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, తెలంగాణాలో పోలీసులపై చేయిచేసుకున్న కేసులో వైఎస్ఆర్ టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల, ఆమెను చూసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన విజయమ్మ ఇలా అందరూ ఒకే రోజున టీవీల్లో కనిపించారని గుర్తుచేశారు. దీంతో వైఎస్ఆర్ కుటుంబ పరువు పోయిందన్నారు. 
 
ఇవన్ని చూసి వైఎస్ఆర్ నిజంగా ఇపుడు చనిపోయి వుంటారని అన్నారు. దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఒక్క మనశ్శాంతి మినహా మిగిలిన అన్నీ ఉన్నాయని తెలిపారు. వివేకా హత్య కేసు విచారణ గత నాలుగేళ్లుగా సాగుతోందని, ఇది మరో యేడాది పాటు సాగినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. 
 
తెలంగాణాలో తాము అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ, ఇది దళితులు, ముస్లింల మధ్య చిచ్చు పెట్టేందుకే అమిత్ షా ఈ తరహా వ్యాఖ్యలు చేశారన ఆయన ఆరోపించారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు ఏపీలో ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల