Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌బంద్‌కు సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు.. రైళ్లు, బస్సులు బంద్

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (08:08 IST)
వివాదాస్పద కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో శుక్రవారం భారత్‌బంద్‌కు రైతుసంఘాల వేదిక 'సంయుక్త కిసాన్‌ మోర్చా' పిలుపునిచ్చింది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసనోద్యమం చేపట్టి 4 నెలలవుతున్న నేపథ్యంలో ఈ పిలుపునిచ్చింది. ఎన్నికలు జరుగనున్న నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరికి బంద్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు. బంద్‌లో తాము పాల్గొనబోమని అఖిల భారత వర్తకుల సమాఖ్య స్పష్టం చేసింది.
 
అలాగే నూతన వ్యవసాయ చట్టాలు, నిత్యావసర, పెట్రో ధరల పెంపు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ అఖిల భారత రైతు సంఘాల సమన్వయ కమిటీ, ప్రజా, కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా శుక్రవారం భారత్‌ బంద్‌ నిర్వహించనున్నారు ఏపీ జిల్లాలో కేంద్ర కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, రాజకీయ పార్టీలు (భాజపా మినహా) మద్దతు తెలిపాయి.
 
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లాలో 789 బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి. కాకినాడ నగరంలో ఇప్పటికే పోర్టు, పరిశ్రమలకు బంద్‌ నోటీసులను కేంద్ర కార్మిక సంఘాలు అందజేశాయి. విద్యాసంస్థలకు నోటీసులు ఇచ్చారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments