Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాఫీ అడిగితే ఇవ్వని భార్య.. వేడి నీళ్లు పోసేసిన భర్త.. ఎక్కడ?

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (22:13 IST)
కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో మహిళలపై గృహ హింసలు పెరిగిపోతున్నాయి. తాజాగా భార్య కాఫీ పెట్టివ్వలేదని ఓ భర్త.. ఆమెపై వేడినీరు పోసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు శివారు ప్రాంతమైన తొట్టప్పళపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతంలో అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న పారిశ్రామిక వేత్త భార్య కావ్య (34). 
 
ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా కుటుంబంతో ఇంట్లోనే వుంటున్నారు. ఈ నేపథ్యంలో కావ్యతో ఆమె భర్త కాఫీ పెట్టివ్వమని అడిగాడు. కానీ కావ్య కాఫీ పెట్టివ్వడం కుదరదని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె భర్త ఆవేశంలో వేడినీటిని కావ్యపై పోసేశాడు. 
 
వేడి తట్టుకోలేక కేకలు పెట్టిన కావ్యను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో అదృష్టకరంగా కావ్య తేలికపాటి గాయాలతో కోలుకుంది. దీనిపై కావ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని కావ్య భర్తపై చర్యలు తీసుకునేందుకు విచారణ చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments