Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థులను కాదు.. ముఖ్యమంత్రి మమతను చెంప దెబ్బలు కొట్టాలి : బెంగాల్ చీఫ్

వరుణ్
మంగళవారం, 30 జనవరి 2024 (13:19 IST)
విద్యార్థులు చదువుల్లో రాణించలేకపోవడం వారి తప్పుకాదని, విద్యావ్యవస్థను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భ్రష్టు పట్టించారని, అందువల్ల ఆమె చెంపలు పగులగొట్టాలని భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్ చీఫ్ సుకాంత మజుందార్ పిలుపునిచ్చారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, బెంగాల్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సీఎం మమతా బెనర్జీ భ్రష్టుపట్టించారని ఆరోపించారు. మన పిల్లలు చదువుల్లో రాణించకపోవడం వారి తప్పు కాదన్నారు. తల్లిదండ్రులు పిల్లన్ని కొట్టడానికి బదులు ముఖ్యమంత్రి మమత బెనర్జీ చెంపలు పగులగొట్టాలంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సుకాంత మజుందరా చేసిన వ్యాఖ్యలు ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో వైరల్ అవుతున్నాయి. 
 
మరోవైపు, సుకాంత చేసిన వ్యాఖ్యలపై అధికార టీఎంసీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చుపెట్టి, భౌతిక దాడులకు ఆయన ప్రేరేపిస్తున్నారంటూ ఆరోపించారు. తక్షణం సీఎం మమతతో పాటు రాష్ట్ర ప్రజానీకానికి ఆయన క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ సుకాంత ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. కాగా, సుకాంత వ్యాఖ్యలకు నిరసనగా టీఎంసీ మహిళా విభాగం మంగళవారం రాజధాని కోల్‌కతాలో ర్యాలీ నిర్వహించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments