Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ ప్రజలారా... ఇకపై మీరు కరెంటు బిల్లులు కట్టవద్దు: కేటీఆర్ పిలుపు

Advertiesment
ktramarao

ఐవీఆర్

, శనివారం, 20 జనవరి 2024 (14:22 IST)
తాము అధికారంలోకి వస్తే గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్తు ఇస్తామంటూ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారనీ, అందువల్ల ఈ నెల నుంచి తెలంగాణ ప్రజలు కరెంటు బిల్లులు కట్టవద్దని మాజీమంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారం సమయంలో కరెంటు బిల్లులను సోనియా గాంధీ కడతారని రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను ఆయన గుర్తు చేసారు. కనుక అధికారంలోకి వచ్చారు కనుక కరెంటు బిల్లులు ప్రభుత్వమే కట్టాలని డిమాండ్ చేసారు. ఇకపై ప్రజలు తమ కరెంటు బిల్లులను సోనియా గాంధీ ఇంటికి పంపించాలని అన్నారు.
 
మరోవైపు భారాసను 100 మీటర్ల లోతు గొయ్యి తీసి అందులో పాతిపెడతామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. 100 మీటర్ల లోతులో గొయ్యి తీసి పాతిపెట్టే విషయం తర్వాత చూద్దాం... మీరు ముందు ఇచ్చిన గ్యారెంటీలను నెరవేర్చాలని డిమాండ్ చేసారు.
 
తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన తెలంగాణ జెండాకు బొంద పెడతారా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలు నెరవేరుస్తామన్న విషయాన్ని ముందుగా ఆచరించి చూపాలని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనా స్కూలులో మంటలు.. 13మంది సజీవ దహనం