Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చైనా స్కూలులో మంటలు.. 13మంది సజీవ దహనం

fire accident

సెల్వి

, శనివారం, 20 జనవరి 2024 (12:57 IST)
చైనాలోని హెనాన్ ప్రావిన్స్ స్కూలుకు చెందిన వసతి గృహంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 13మంది విద్యార్థులు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన శుక్రవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. యన్షాన్పు గ్రామంలోని యింగ్‌కై స్కూల్‌లో ఈ ఘోరం చోటుచేసుకుంది. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్కూలుకు చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకున్నారు. 
 
మంటల్లో చిక్కుకున్న 13 మంది విద్యార్థులు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనవరి 22న విద్యాసంస్థలకు హాలిడే... ఏపీ తప్ప?