Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందమైన భార్య, ఉదయం నుంచి ఫోన్లో చాటింగ్, అనుమానంతో భర్త

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (17:28 IST)
మూడుముళ్ల బంధానికి అనుమానం ముల్లు గుచ్చుకుంది. క్షణికావేశం పిల్లలకు తల్లిని దూరం చేసింది. భర్త చేతిలో భార్య హత్యకు గురైంది. ఆ ఇంటి దీపం ఆరిపోయింది. భవిష్యత్తు చీకటిగా మారింది. భార్యపై అనుమానంతో హత్య చేసిన ఘటన అనంతపురం జిల్లా జీసస్‌నగర్‌లో జరిగింది. కర్నూలు జిల్లా చిప్పగిరి సమీపంలోని నంచెర్ల గ్రామానికి చెందిన కవితను, అదే ప్రాంతానికి చెందిన సంతోష్ 13 ఏళ్ల కిందట వివాహం చేసుకున్నాడు.
 
అనంతపురంలో ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తూ.. జీసస్‌నగర్‌లో స్థిరపడ్డాడు. సంసారం సాఫీగా సాగుతుంది. ఇంతలోనే కవితకు నంచెర్లలో పరిచయం ఉన్న ఆర్‌ఎంపీ వైద్యుడు ఇటీవల తరచూ ఫోన్‌ చేసి మాట్లాడుతున్నాడు. గత ఏడాదిలో కరోనా వ్యాప్తి చెందటంతో కవిత ఇద్దరి పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. 
 
ఆరు నెలల తర్వాత భర్త వెళ్లి అనంతపురానికి తీసుకొచ్చాడు. తరచూ ఫోనులో మాట్లాడటంపై పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిపారు. కానీ భార్య ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. నిన్న రాత్రి భార్యాభర్తలు గొడవ పడ్డారు. భార్య ఫోన్లో మెసేజ్‌లు, చాటింగ్‌లు చూసి మరింత కోపంతో ఊగిపోయాడు సంతోష్. లుంగీని గొంతుకు బిగించి చంపేసి అనంతరం పోలీసు స్టేషనులో లొంగిపోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments