Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరిన బాలుడు.. పొట్టలో 56 వస్తువులు..

ఠాగూర్
సోమవారం, 4 నవంబరు 2024 (12:37 IST)
కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరిన ఓ బాలుడు కడుపులో వైద్యులు ఏకంగా 56 వస్తువులను గుర్తించారు. ఈ ఆశ్చర్యకర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్‌లో వెలుగు చూసింది. అయితే, ఆ బాలుడుకి ఆపరేషన్ చేసి కడుపులోని వస్తువులన్నీ బయటకు తీశారు. అయితే, వైద్యులు ఎంతగా కృషి చేసినా ఆ బాలుడు ప్రాణాలను మాత్రం నిలబెట్టలేకపోయారు. 
 
హత్రాస్‌కు చెందిన 15 యేళ్ల బాలుడు ఆదిథ్య స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుకున్నాడు. కొంతకాలంగా ఆ కుర్రాడు కడుపునొప్పితో బాధపుడుతున్నాడు. ఈ రోజు రోజుకూ నొప్పి తీవ్రతరం కావడంతోపాటు ఊపిరి ఆడకపోవడంతో తల్లిదండ్రులు ఆదిత్యను ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు స్కానింగ్ చేసి చూడగా అతని పొట్టలో వివిధ వస్తువులు కనిపించాయి. వెంటనే ఆపరేషన్ చేసి కడుపులో నుంచి ఏకంగా 56 రకాలై వస్తువులను వెలికి తీశారు. 
 
వీటిలో బ్యాటరీలు, బ్లేడ్‌లు, మొలలు, గోర్లతో పాటు చిన్న చిన్న ఇనుప వస్తువులు ఉన్నాయి. ఇవన్నీ ఆదిత్య నోటితో మింగాడని వైద్యులు భావిస్తున్నారు. అయితే, ఆదిత్య గొంతుకు కానీ, ప్రేగులకు గానీ ఎలాంటి గాయం కాకపోవడంతో వారు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఆదిత్యను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని వైద్యులు తెలిపారు. ఈ నెల 27వ తేదీన ఢిల్లీలోని సప్థర్ జంగ్ ఆస్పత్రిలో ఆదిత్యకు ఆపరేషన్ చేయగా, ఆ మురసటి రోజు ఆదిత్య చనిపోయాడని తల్లిదండ్రులు వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments