Webdunia - Bharat's app for daily news and videos

Install App

బఠిండాలో మళ్లీ కాల్పుల మోత.. జవాను మృతి

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2023 (11:32 IST)
పంజాబ్ రాష్ట్రంలోని బఠిండాలోని సైనిక స్థావరంలో మళ్లీ కాల్పుల శబ్దం వినిపించింది. ఈ కాల్పులు జరిగిన కొన్ని గంటల్లోనే మరో జవాను ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం సాయంత్రం ఓ జవాను బుల్లెట్‌ గాయంతో మృతిచెందినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. అయితే, తాజా ఘటనకు అంతకుముందు జరిగిన కాల్పులతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.
 
అయితే, ఈ జవాను ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా ఏదైనా ప్రమాదం జరిగిందా? అన్నదానిపై స్పష్టత లేదు. ప్రమాదవశాత్తూ తుపాకీ పేలడంతో అతడు మరణించి ఉంటాడని ఆర్మీ అధికారులు అనుమానిస్తున్నారు. మృతుడిని లఘు రాజ్‌ శంకర్‌గా గుర్తించారు.
 
కాగా, బఠిండా సైనిక స్థావరంలో బుధవారం తెల్లవారుజామున కాల్పులు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఆగంతకులు జరిపిన దాడిలో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల శబ్దం వినిపించగానే సత్వర ప్రతిస్పందన బృందాలు అప్రమత్తమై ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకొని గాలింపు చేపట్టాయి. 
 
దుండగులు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. వారి కోసం వేట కొనసాగుతోంది. కుర్తా పైజామా ధరించి, ముఖానికి మాస్కులతో వచ్చిన దుండగులు ఈ కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే మరో జవాను బుల్లెట్‌ గాయంతో మరణించడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవుల్లో కీర్తి సురేష్ రొమాంటిక్ వెకేషన్... భర్తతో కలిసి ఎంజాయ్...

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments