Webdunia - Bharat's app for daily news and videos

Install App

బఠిండాలో మళ్లీ కాల్పుల మోత.. జవాను మృతి

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2023 (11:32 IST)
పంజాబ్ రాష్ట్రంలోని బఠిండాలోని సైనిక స్థావరంలో మళ్లీ కాల్పుల శబ్దం వినిపించింది. ఈ కాల్పులు జరిగిన కొన్ని గంటల్లోనే మరో జవాను ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం సాయంత్రం ఓ జవాను బుల్లెట్‌ గాయంతో మృతిచెందినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. అయితే, తాజా ఘటనకు అంతకుముందు జరిగిన కాల్పులతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.
 
అయితే, ఈ జవాను ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా ఏదైనా ప్రమాదం జరిగిందా? అన్నదానిపై స్పష్టత లేదు. ప్రమాదవశాత్తూ తుపాకీ పేలడంతో అతడు మరణించి ఉంటాడని ఆర్మీ అధికారులు అనుమానిస్తున్నారు. మృతుడిని లఘు రాజ్‌ శంకర్‌గా గుర్తించారు.
 
కాగా, బఠిండా సైనిక స్థావరంలో బుధవారం తెల్లవారుజామున కాల్పులు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఆగంతకులు జరిపిన దాడిలో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల శబ్దం వినిపించగానే సత్వర ప్రతిస్పందన బృందాలు అప్రమత్తమై ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకొని గాలింపు చేపట్టాయి. 
 
దుండగులు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. వారి కోసం వేట కొనసాగుతోంది. కుర్తా పైజామా ధరించి, ముఖానికి మాస్కులతో వచ్చిన దుండగులు ఈ కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే మరో జవాను బుల్లెట్‌ గాయంతో మరణించడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments