Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురుకులాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - 17 నుంచి దరఖాస్తుల స్వీకరణ

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2023 (11:07 IST)
తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో ఉన్న ఖాళీ పోస్టుల భర్తీకి ఆ రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో ఈ నెల 17వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు తొలుత వన్ టైమ్ రిజిస్ట్రేషన్ కోసం ఓటీఆర్‌ను నమోదు చేసుకోవాల్సి వుంటుంది. ఆ తర్వాతే దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లభిస్తుంది. 
 
ఓటీఆర్ నమోదు కోసం తొలుత ఆధార్ నంబరును నమోదు చేసి ఆపై వ్యక్తిగత వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు చదివిన జిల్లాను నమోదు చేయడంతో ఓటీఆర్ పూర్తవుతుంది. ఆ తర్వాత నోటిఫికేషన్ల వారీగా అర్హత మేరకు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు వీలుపడుతుంది. 
 
ఓటీఆర్ నమోదు తర్వాత యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ సాయంతో తగిన పోస్టుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పరీక్ష ఫీజును చెల్లించి, మిగిలిన వివరాలను భర్తీ చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. కాగా, గురుకులాల్లో మొత్తం 9231 పోస్టులకు గురుకుల నియామక బోర్డు ఈ నెల 9వ తేదీన నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విద్యార్థుల సమక్షంలో త్రిబాణధారి బార్భరిక్ మూవీ నుంచి పాట విడుదల

Sidhu : జాక్ చిత్రంలో బూతు డైలాగ్ లుంటాయ్ : సిద్ధు జొన్నలగడ్డ

మినిమం ఓపెనింగ్‌ను రాబట్టుకోలేకపోతున్న టాలీవుడ్ హీరోలు!!

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments