Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవిష్కరణకు సిద్ధమైన 125 అడుగులు రాజ్యాంగ నిర్మాత విగ్రహం

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2023 (10:40 IST)
హైదరాబాద్ నగరంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌కు భారీ విగ్రహ ప్రతిష్టాపన జరుగనుంది. ఈ విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తులో తెలంగాణ ప్రభుత్వం తయారు చేయించి ప్రతిష్టించనుంది. ఈ నెల 14వ తేదీన శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది.
 
దేశంలో ఇప్పటివరకు ఉన్న అంబేద్కర్ విగ్రహాల్లో అతిఎత్తైన విగ్రహం కానుంది. పార్లమెంట్ ఆకారంలో 50 అడుగుల పీఠం, ఆపైన 125 అడుగుల నిలువెత్తు లోహ విగ్రహాన్ని తయారు చేశారు. అంబేద్కర్ 132వ జయంతి వేడుకల సందర్భంగా ఈ విగ్రహాన్ని సీఎం కేసీఆర్, కొందరు బౌద్ధ గురువుల ప్రార్థనల మధ్య ఆవిష్కరిస్తారు. 
 
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. ఈ విగ్రహ ఆవిష్కరణకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు  వచ్చేందుకు వీలుగా రవాణా సదుపాయాన్ని కూడా ప్రభుత్వం కల్పించనుంది. ఇందుకోసం వచ్చే వారిలో దాదాపు 50 వేలమంది  కూర్చొనే విధంగా కుర్చీలు, ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments