Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మంకీపాక్స్ ప్రమాదం ఘంటికలు - బెంగుళూరు, కేరళల్లో అలెర్ట్

Webdunia
మంగళవారం, 26 జులై 2022 (16:39 IST)
ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇప్పటికే 75 దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. దాదాపు 16 వేల మంది ఈ వైరస్ బారినపడ్డారు. అదేసమయంలో మన దేశంలో కూడా ఈ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్రం అప్రమత్తమై, అన్ని రాష్ట్రాలను అలెర్ట్ చేసింది.
 
ఇందులోభాగంగా కేరళ, బెంగుళూరు రాష్ట్రాల్లో హైఅలెర్ట్ ప్రకటించింది. అలాగే, ఈ రెండు విమానాశ్రయాల్లో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను నిశితంగా తనిఖీ చేసేందుకు, వైద్య పరీక్షలు చేసేలా చర్యలు తీసుకున్నారు. రెండు రాష్ట్రాల్లో ప్రధాన ఆస్పత్రుల్లో మంకీపాక్స్ రోగులకు వైద్యం చేసేందుకు వీలుగా ప్రత్యేక వార్డులను కూడా ఏర్పాటుచేశారు. 
 
ప్రస్తుతం మన దేశంలో నమోదైన నాలుగు కేసుల్లో మూడు కేరళ రాష్ట్రంలోనూ, ఒకటి ఢిల్లీలో నమోదైవున్నాయి. దీంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమై గత ఆదివారం అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments