Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరవేగంగా రామాలయ నిర్మాణ పనులు-అక్టోబర్ నాటికి పునాది పనులు పూర్తి

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (12:32 IST)
అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ నాటికి పునాది పనులు పూర్తి అవుతాయని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తన ట్విట్టర్‌లో వెల్లడించింది. అయితే ఆలయానికి సంబంధించిన గ్రౌండర్ ఫ్లోర్ వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల లోపే ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. 
 
ఆలయ నిర్మాణ పనుల్లో నిమగ్నమైన ఇంజినీర్లు, కార్మికులు అంతా ఆరోగ్యంగా, సురక్షితంగా ఉన్నట్లు ట్రస్టు పేర్కొన్నది. ప్రతి రోజు రెండు ఫిఫ్ట్‌లుగా పనులు జరుగుతున్నట్లు ట్రస్టు కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. 
 
పునాది పనులను రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్ టెక్నిక్‌లో పూర్తి చేయనున్నారు. సుమారు లక్షా 20 వేల చదరపు ఫీట్ల విస్తీర్ణంలో 40 నుంచి 45 లేయర్లలో కాంక్రీట్ వేయనున్నారు. ఇప్పటికే నాలుగు లేయర్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఆర్‌సీసీ పనులు అక్టోబర్ నాటికి పూర్తి కానున్నట్లు ట్రస్టు తన ట్వీట్‌లో తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anupama : దెయ్యంలా వుంటావని అమ్మ తిడుతుండేది : అనుపమ పరమేశ్వరన్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

తర్వాతి కథనం
Show comments