Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్‌లో మిగిలిపోయిన మ్యాచ్‌లు నవంబరులో?

Advertiesment
ఐపీఎల్‌లో మిగిలిపోయిన మ్యాచ్‌లు నవంబరులో?
, ఆదివారం, 23 మే 2021 (14:30 IST)
స్వదేశంలో జరుగుతూ వచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ పోటీలు కరోనా వైరస్ కారణంగా అర్థాంతరంగా వాయిదాపడ్డాయి. సగం మ్యాచ్‌లు పూర్తికాగా, మిగిలిపోయిన మ్యాచ్‌లను సెప్టెంబ‌ర్‌లో నిర్వ‌హించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ మ్యాచులు సెప్టెంబ‌ర్ 15 నుంచి అక్టోబ‌ర్ 15 వ‌ర‌కు మిగిలిన 31 మ్యాచులు ఆడించ‌నున్న‌ట్లు తెలుస్తున్న‌ది. 
 
ఐపీఎల్ మిగిలిపోయిన మ్యాచుల‌ను యూఏఈ వేదిక‌గా నిర్వ‌హించేందుకు బీసీసీఐ క‌స‌ర‌త్తు జ‌రుపుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. 29 మ్యాచ్‌ల తర్వాత కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ వాయిదా పడింది.60 ల‌లో 31 మ్యాచ్‌లు ఇంకా జరగలేదు.
 
ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లకు బీసీసీఐ చివరకు ఒక ప‌రిష్కారం కనుగొన్న‌ది. మిగిలిన మ్యాచ్‌లు సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 మధ్య యూఏఈలో జరుగుతాయని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే, ఇదేస‌మ‌యంలో ఈ మ్యాచ్‌ల నిర్వ‌హ‌ణ‌ కోసం ఇంగ్లండ్, యూఏఈల‌ను బోర్డు ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలుస్తున్న‌ది.
 
భారత్‌లో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా 2014 లీగ్‌లో మొదటి 20 మ్యాచ్‌లకు యూఏఈ ఆతిథ్యం ఇచ్చింది. కరోనా కారణంగా 2020 సీజన్ కూడా యూఏఈలోనే పూర్త‌యింది. గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో పెట్టుకుని ప్ర‌స్తుత టోర్న‌మెంట్ సీజ‌న్‌ను యూఏఈలో పూర్తిచేయాల‌ని బోర్డు భావిస్తున్న‌ట్లుగా స‌మాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భువనేశ్వర్‌కు పితృవియోగం.. కేన్సర్‌తో బాధపడుతూ మృతి