Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌కు ఎమ్మెల్యే మద్దతు.. బొక్కలో పడేసిన పోలీసులు.. ఎక్కడ?

ఠాగూర్
శుక్రవారం, 25 ఏప్రియల్ 2025 (10:48 IST)
కాశ్మీర్ లోయలోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా, పాకిస్థాన్‌కు సరైన గుణపాఠం నేర్పేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఇందులోభాగంగా, పాకిస్థాన్‌పై దౌత్యయుద్ధం ప్రకటించింది. సరిహద్దులను మూసివేసింది. సింధూ జలాల ఒప్పందం, ఇరు దేశాల సరిహద్దుల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలో అస్సాంకు చెందిన ఓ ఎమ్మెల్యే పాకిస్థాన్‌కు జై కొట్టారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 
 
అస్సాంలో విపక్ష పార్టీ ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమినుల్ ఇస్లామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై దేశద్రోహం కేసు పెట్టినట్టు ఆ రాష్ట్ర బీజేపీ పాలిత ముఖ్యమంత్రి హిమంత వెల్లడించారు. మరోవైపు, అమినుల్ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, ఏఐయూడీఎఫ్ ప్రకటించింది. ఆ వ్యాఖ్యలు పూర్తిగా అమినుల్ వ్యక్తిగతమని తెలిపింది. ఉగ్రదాడిపై పాకిస్థాన్‌కు ఏ విధంగ మద్దతు పలికినా వారిపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హిమంత హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

కమల్ హాసన్, రజనీకాంత్‌లపై లోకేష్ కనగరాజ్ దమ్మున్న ప్రకటన చేశాడు

మునుపెన్నడూ లేని విధంగా స్క్రీన్‌లపై కింగ్‌డమ్ విడుదల కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments