Webdunia - Bharat's app for daily news and videos

Install App

లఖింపూర్‌ ఖేరి: ఆశిష్‌ మిశ్రా అరెస్ట్‌

Webdunia
ఆదివారం, 10 అక్టోబరు 2021 (09:54 IST)
లఖింపూర్‌ ఖేరి ఘటనలో నిందితుడిగా భావిస్తున్న కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా అరెస్ట్‌య్యాడు. యూపీ పోలీసులు అశిష్‌ మిశ్రాను అరెస్ట్ చేశారు. ఈనెల 3న లఖింపూర్‌ ఖేరిలో సాగుచట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి అశిష్‌ మిశ్రా కారు దూసుకెళ్లింది.

ఈ ఘటనలో నలుగురు రైతులు మృతిచెందారు. అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలో మరో నలుగురు మృతిచెందారు. దీంతో ఈ ఘటన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనమైంది.
 
రైతుల మృతిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఈ కేసులో అశిష్‌ మిశ్రా పేరును పోలీసులు చేర్చారు. ఇందులో భాగంగా అశిష్‌ మిశ్రా విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో క్రైం బ్రాంచ్‌ పోలీసులు ఎదుట అశిష్‌ హాజరయ్యారు. దీంతో పోలీసులు అశిష్‌ మిశ్రాను 11 గంటల పాటు ప్రశ్నించారు. ఇక విచారణకు సహకరించడం లేదని చివరకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. అటు అశిష్‌ మిశ్రను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments