Webdunia - Bharat's app for daily news and videos

Install App

లఖింపూర్‌ ఖేరి: ఆశిష్‌ మిశ్రా అరెస్ట్‌

Webdunia
ఆదివారం, 10 అక్టోబరు 2021 (09:54 IST)
లఖింపూర్‌ ఖేరి ఘటనలో నిందితుడిగా భావిస్తున్న కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా అరెస్ట్‌య్యాడు. యూపీ పోలీసులు అశిష్‌ మిశ్రాను అరెస్ట్ చేశారు. ఈనెల 3న లఖింపూర్‌ ఖేరిలో సాగుచట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి అశిష్‌ మిశ్రా కారు దూసుకెళ్లింది.

ఈ ఘటనలో నలుగురు రైతులు మృతిచెందారు. అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలో మరో నలుగురు మృతిచెందారు. దీంతో ఈ ఘటన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనమైంది.
 
రైతుల మృతిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఈ కేసులో అశిష్‌ మిశ్రా పేరును పోలీసులు చేర్చారు. ఇందులో భాగంగా అశిష్‌ మిశ్రా విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో క్రైం బ్రాంచ్‌ పోలీసులు ఎదుట అశిష్‌ హాజరయ్యారు. దీంతో పోలీసులు అశిష్‌ మిశ్రాను 11 గంటల పాటు ప్రశ్నించారు. ఇక విచారణకు సహకరించడం లేదని చివరకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. అటు అశిష్‌ మిశ్రను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments