Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుదీర్ఘకాల బాధ ముగిసింది... కుమార్తె ఫోటోను హత్తుకుని....

Webdunia
శుక్రవారం, 20 మార్చి 2020 (07:35 IST)
తన సుదీర్ఘకాల బాధ ముగిసిందంటూ తన కుమార్తె నిర్భయ ఫోటోను హత్తుకున్నానని నిర్భయ తల్లి ఆశాదేవి ఉద్వేగపూరిత స్వరంతో చెప్పుకొచ్చారు. తనకు జరిగిన అన్యాయం మరే తల్లికి జరగకూడదన్నారు. ఇప్పటివరకు తాను చేసిన పోరాటం నిర్భయ కోసమని, ఇకపై మన కుమార్తెల కోసం పోరాటం చేస్తానని ఆమె ప్రకటించారు. 
 
నిర్భయ అత్యాచార కేసులో నలుగురు దోషులకు శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఉరిశిక్షలను తీహార్ జైలులో అమలు చేసిన విషయం తెల్సిందే. ఈ శిక్షల తర్వాత ఈ నలుగురు చనిపోయారని వైద్యులు ధృవీకరించిన తర్వాత ఆశాదేవి మీడియాతో మాట్లాడారు. తమకు న్యాయం జరిగిందని, నిర్భయ ఆత్మకు శాంతి చేకూరిందన్నారు. 
 
నలుగురికీ ఉరితీత పూర్తయిన తర్వాత ఆశాదేవి విజయ చిహ్నం చూపిస్తూ సంతోషంగా కనిపించారు. తన కుమార్తె లేదని, ఇకపై రాదని పేర్కొన్న ఆమె.. కుమార్తెను కోల్పోయిన తర్వాత తాము పోరాటం ప్రారంభించినట్టు చెప్పారు. ఇప్పటివరకు తమ పోరాటం నిర్భయ గురించేనని, ఇకపై 'మన కుమార్తె'ల కోసం పోరాడతానని చెప్పారు. దోషులకు ఉరిశిక్ష అమలు జరిగిన వెంటనే తన కుమార్తె ఫొటోను హత్తుకున్నానని ఆశాదేవి ఉద్వేగపూరిత కంఠంతో చెప్పారు.
 
మొత్తానికి వారికి ఉరిపడిందని పేర్కొన్న ఆశాదేవి.. ఇదో సుదీర్ఘకాల బాధ అని అన్నారు. ఇన్నాళ్లకు తమకు న్యాయం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ రోజును దేశంలోని అందరి కుమార్తెలకు అంకితం ఇస్తున్నట్టు చెప్పారు. భారత ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకు ఆశాదేవి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments