Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వారియర్స్ చనిపోతే రూ.కోటి : ఢిల్లీ సర్కారు

Webdunia
గురువారం, 23 జులై 2020 (16:24 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. ఈ వైరస్ నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు ఇళ్లు వదిలి బయటకు రావడంలేదు. కానీ, వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ఆంబులెన్స్ సిబ్బంది మాత్రం తమ ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. అందుకే వీరిని కరోనా వారియర్స్‌గా పిలుస్తున్నారు. 
 
ఇలాంటి వారిలో కొందరు ఈ వైరస్ బారినపడి చనిపోతున్నారు కూడా. ఇటీవల ఢిల్లీలో ఓ పోలీసు కానిస్టేబుల్ ఈ వైరస్‌కు చనిపోయాడు. ఆయన కుటుంబానికి సంతాపం వ్యక్తం చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఆ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. 
 
అంతేకాకుండా కరోనా వారియర్లు ఎవరైనా కోవిడ్-19 వల్ల మరణించినా వారందరి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియో అందజేస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఫ్రంట్‌లైన్ కోవిడ్19 వారియర్స్ అందరికీ ఈ ఎక్స్‌గ్రేషియో వర్తిస్తుందని ఢిల్లీ సీఎంవో పేర్కొంది.
 
'అమిత్ జీ తన జీవితాన్ని పట్టించుకోకుండా ఢిల్లీ ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాడు. కానీ దురృష్టవశాత్తూ అతడు కరోనా బారిన పడి మరణించాడు. ఢిల్లీ ప్రజలందరి తరపున ఆయన చేసిన త్యాగానికి నేను నివాళులర్పిస్తున్నాను. అంతేకాకుండా అతడి కుటుంబానికి ఒక కోటి రూపాయల ఎక్స్-గ్రేటియా ఇస్తామని ప్రకటిస్తున్నాం' అంటూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments